ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజకీయ నాయకులు

పిన్నమనేని కోటేశ్వరరావు గారు

'పి'లవగానే పలికిన వ్యక్తి
అ'న్న' లా ఆదరించిన వ్యక్తి
మంచి 'మ' నసున్న వ్యక్తి
'నే'నున్నానని అభయమిచ్చిన వ్యక్తి
'ని'రంతరం ప్రజా శ్రేయస్సు కోరిన వ్యక్తి
'కో'ట్ల కం'టే' ప్రజలే ముఖ్యమన్న వ్యక్తి
శా'శ్వ'తమైనవి కీర్తి ప్రతిష్టలని చెప్పిన వ్యక్తి
వా'ర'సులను పార్టీలో మమైక్యం చేసిన వ్యక్తి
జిల్లాలో మకుటంలేని మహారాజు మన'రావు' గారు
జిల్లాలో కాంగ్రెస్ ను పటిష్టం చేసి
ఎన్నో పదవులు నిర్వహించినా
ఎందరికో ఉద్యోగాలు కల్పించినా
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినా
నిరాడంబరుడై,ప్రజా నాయకుడై,జిల్లా వాసులకుదేవుడై
ఆశయ సాధనలో కృతకృత్యుడై
వారసులకు, కార్యకర్తలకు మార్గదర్శకుడైనాడు
పార్టీని, ప్రజలను,వారసులకు అప్పగించి
ప్రజానాయకులై ఎదగాలంటూ
తన ఆశయాలను కొనసాగించాలంటూ హితబోధ చేసి
అమరేంద్రుని చెయ్యందుకొని
అమరపురి చేరె విశ్రాంతికై
మన పిన్న మనేని కోటేశ్వరరావు గారు
---------------------------------------------
వై.యస్.ఆర్ గారు

కడప గడ్డలో జన్మించి
డాక్టర్ వృత్తిని చేబూని
రోగుల ఆరోగ్యాన్ని చక్కదిద్దాడు
కాంగ్రెస్ పార్టీలో చేరి
పాదయాత్రలు చేసి
అందరి మన్ననలు పొంది
ముఖ్యమంత్రి పదవి చేపట్టి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాడు
ఉచిత విద్యుత్తునందించి
రైతు కళ్ళలో ఆశలు పండించిన రైతుబిడ్డ
బీడుభూములకు నీళ్ళిచ్చి
సాగు భూములుగా మార్చిన కలియుగ భగీరధుడు
ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి
ప్రజలచే జేజేలందుకున్నట్టి మరో కాటన్ దొర
వృద్ధాప్యపు పింఛన్లు పెంచి
వృద్ధుల ఇక్కట్లు తొలగించిన ఆపద్బాందవుడు
పావలా వడ్డీకి ఋణాలిచ్చి
డ్వాక్రా గ్రూపు అవసరాలు తీర్చిన మానవతామూర్తి
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కల్పించి
ఉచిత వైద్యసదుపాయలందించిన వైద్య పితామహుడు
ఆయనే హరతాంధ్ర ప్రదేశ్ స్థాపకుడు
మన వై.యస్.రాజశేఖర రెడ్డి గారు
----------------------------------------
వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు

అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
విజయమ్మతో కలిసన్నా
పాదయాత్రలే చేయాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
ప్రజల గోడు వినుమన్నా
ప్రజల కష్టాలు చూడన్నా
ప్రజల కన్నీరు తుడువన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
ప్రాజెక్టుల్ని చూడన్నా
వెలవెల బోతున్నాయన్నా
రాష్ట్ర పాలన చూడన్నా
పదవులకోసం గొడవన్నా
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారన్నా
రాష్ట్ర ప్రగతి మరిచారన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
గద్దె నెక్కు నీవన్నా
హరతాంధ్ర ప్రదేశ్ ను కాపాడన్నా
రాష్ట్రాన్ని చక్క దిద్దన్నా
ప్రాజెక్టుల్ని నిర్మించాలన్నా
నీళ్ళ కరువు తీర్చాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
అందరినీ ఒక్క తాటిపై నడుపన్నా
మంచి పాలకుడిగా నిలవాలన్నా
రాజన్న కలలు నెరవేర్చాలన్నా
అన్నా అన్నా జగనన్నా
నీవే దిక్కు మాకన్నా
------------------------------------------

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...