ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రామాయణం

 రామాయణం 2 భాగాలు 

1) రాముని జననం నుంచి పట్టాభిషేకం వరకు

2) పట్టాభిషేకం నుంచి నిర్యాణం వరకు. 

ఈ రెండవ భాగాన్ని ఉత్తర  రామాయణం అంటారు. 

మొదటి భాగం : A ) వాల్మీకి (లేక) రత్నాకరుడు: ఈయన సంస్కృతంలో  రామాయణం వ్రాసి ఆదికవి అయ్యారు. ఇందులో 6 కాండలు కలవు.1 బాల 2 అయోధ్య 3 అరణ్య 4 కిష్కింద 5 సందర 6 యుద్ధ 

కాండలు. ఇందులో 24000 శ్లోకాలు కలవు. ఇది వీర రసానికి చెందింది. తెలుగులో 6 కాండలతో పాటు 7వ కాండ ఉత్తర కాండ కలదు 

2వ భాగం : B) భవభూతి :  ఈయన సంస్కృతంలో ఉత్తర రామాయణం వ్రాశారు.

1) కంకంటి పాపరాజు :  ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా వ్రాశారు. 

2)  గోన బుద్ధారెడ్డి :  కాలం 13వ శతాబ్దం 

రంగనాధ రామాయణం. ఇది తొలి తెలుగు నవల. 

ఇది ద్విపదలో వ్రాయబడింది 

3) తిక్కన : 13వ శతాబ్దం ఈయన నిర్వచనోత్తర రామాయణం వ్రాశారు. 

4) ఎర్రన : 14 వ శతాబ్దం  రచన : రామాయణం 

5) హుళక్కి భాస్కరుడు : 14వ శతాబ్దం 

భాస్కర రామాయణం ఇది చంపూ కావ్యం 

6) మొల్ల : ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం 

రచన : మొల్ల రామాయణం. ఇందులో 6 కాండలు 900 ల పద్యాలున్నాయి 

7) అయ్యలరాజు రామభద్రుడు : 16వ శతాబ్దం 

రచన : రామాభ్యుదయం. ఇందులో 8 ఆశ్వాసాలు ఉన్నాయి. (ఇది రాముని చరిత్ర) 

8) కూచిమంచి తిమ్మకవి : 18 వ శతాబ్దం 

రచన : అచ్చ తెనుగు రామాయణం 

9) గోపీనాథ వేంకటకవి :  19 వ శతాబ్దం 

రచన : గోపీనాథ రామాయణం 

10) వావిలికొలను సుబ్బారావు : 

రచన : ఆంధ్ర వాల్మీకి రామాయణం 

11) మానికొండ సత్యనారాయణ శాస్త్రి : 

రచన : మానికొండ రామాయణం( తెలుగు వాల్మీకము) 

12) శ్రీపాద కృష్ణమూర్తి : రచన : శ్రీకృష్ణ రామాయణం 

బిరుదు : కవిసార్వభౌమ 

13) విశ్వనాథ సత్యనారాయణ : బిరుదు : కవి సామ్రాట్ ; రచన : శ్రీమద్రామాయణ కల్పవృక్షం. 

14)  చేబ్రోలు సరస్వతీ దేవి : సరస్వతీ రామాయణం 

15) గడియారం వేంకట శేషశాస్త్రి :  శ్రీమదాంధ్ర రామాయణం 

16) కూచిమంచి జగ్గకవి : తారకబ్రహ్మ రామాయణం 

వాల్మీకి రామాయణంలో రాముడు లక్ష్మణుడ్ని దేశ బహిష్కరణ చేసిన ఘట్టం కలదు 

* వాల్మీకి రామాయణంలో లేని ఘట్టాలు ఇతర రామాయణాలలో ఉన్నాయి 

1 మొల్ల రామాయణం : గుహుడు రాముని కాళ్లు కడగటం 

2 భాస్కర రామాయణం : సుగ్రీవ దశరధుల సంభాషణ, 

యుద్ధ కాండ, మందర దుర్భోద 

3 రంగనాధ రామాయణం :  ఇంద్రుడు కోడై కూయటం, అహల్య రాయిగా పడి ఉండటం, ఉడుత భక్తి, లక్ష్మణరేఖ, లక్ష్మణుడి నవ్వు 

* సూర్య వంశ రాజులు : వైవశ్వంతరమనువు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు, అజుడు, దశరధుడు, రాముడు, కుశుడు. 

* దశరథుడు అశ్వమేధ,పుత్రకామేష్టి యాగాలు, రాముడు  అశ్వమేధ యాగం చేశారు. 

* రాముడు 14 సం|| లు వనవాసం చేశారు. 

* భరతుడు రాముని పాదుకలతో రాజ్యపాలన చేసిన గ్రామం  "నందిగ్రామం". 

* కైకేయికి దవళాంగుడనే ముని మాయలను ప్రక్షాళన చేసే విద్యను ప్రసాదించాడు. కైకేయి ఆ విద్యను శంబరాసురుడి పై ప్రయోగించి దశరధుని దగ్గర 

2 వరాలు పొందింది. 1) రాముని వనవాసం 

2) భరతునికి పట్టాభిషేకం 

* సీతకు ఇతర పేర్లు : భూమజ, జానకి, మైధిలీ, అయోనిజ. * పంచవటి : 5 మర్రిచెట్లు గల ప్రదేశం . 

మర్రిచెట్టును వటవృక్షం అంటారు 

* దశరధునికి భార్యలు. - - - కొడుకులు - - కోడళ్ళు 

                    ముగ్గురు - - - నలుగురు     

                    1) కౌసల్య :  శ్రీరాముడు  - -  సీత 

                    2)సుమిత్ర : లక్ష్మణుడు - - - ఊర్మిళ

                                        శతృఘ్నుడు - - - శృతకీర్తి 

                    3) కైకేయి :  భరతుడు - - - -  మాండవిక

 దశరధునికి కౌసల్యకు పుట్టిన  కూతురు : శాంతాదేవి, అల్లుడు :  ఋష్యశృంగుడు              

దశరధుని కుమారులకు గురువు - - వశిష్ఠుడు 

లవకుశల గురువు - - వాల్మీకి 

1) రాముడు, సీతల కుమారులు : లవకుశలు

2)  లక్ష్మణుడు, ఊర్మిళల కుమారులు : తక్షకుడు, చిత్రకేతుడు

3) శతృఘ్నుడు, శృతకీర్తిల కుమారులు : సుబాహుడు, శ్రుతసేనుడు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...